News February 22, 2025

టన్నెల్ ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది: ఎస్పీ

image

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ <<15542138>>టన్నెల్ ప్రమాదంపై<<>> ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి చేరుకోనున్నారు.

Similar News

News January 31, 2026

ఒక్క రోజే రూ.85,000 తగ్గిన సిల్వర్ రేటు

image

బులియన్ మార్కెట్‌లో వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కేజీ వెండి రేటు <<19009714>>రూ.55వేలు తగ్గగా<<>>, గంటల వ్యవధిలోనే మరో రూ.30వేలు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే సిల్వర్ రేటు రూ.85వేలు తగ్గి రూ.3,20,000కు చేరింది.

News January 31, 2026

యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే

image

AP: భూముల రీసర్వేలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ‘ప్రస్తుతం కొత్తగా చేపట్టే సర్వేలో భూయజమానిని తప్పనిసరిగా భాగస్వామిని చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆయన వచ్చాకనే రీసర్వే చేయాలి. భూ రికార్డు వివరాలను యజమానులకు చూపించి ఓకే అంటేనే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. ప్రతినెల 2-9 తేదీల మధ్య పాస్‌ పుస్తకాలు అందించాలి’ అని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది.

News January 31, 2026

పెసర, మినుములో తెల్లదోమ నివారణకు సూచనలు

image

పెసర, మినుము పంటల్లో తెల్లదోమల ముప్పు పెరిగింది. ఇవి పంటలను ఆశించి మొక్కల ఆకులోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులును కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 1.5ml లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తామర పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.