News July 3, 2024
క్వార్టర్స్కు దూసుకెళ్లిన తుర్కియే, నెదర్లాండ్స్

యూరో ఛాంపియన్ షిప్లో తుర్కియే, నెదర్లాండ్స్ క్వార్టర్స్ దూసుకెళ్లాయి. నిన్న రొమేనియాతో జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ ప్లేయర్ల డామినేషనే కొనసాగింది. మరో మ్యాచులో ఆస్ట్రియాపై తుర్కియే 2-1తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ప్లేయర్ మెరిహ్ డెమిరల్ రెండు గోల్స్ చేయడం గమనార్హం. ఈ నెల 5 నుంచి 7 వరకు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి.
Similar News
News September 3, 2025
గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లోనే 28 మంది మరణించారు. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వారికి ‘ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు త్వరగా సోకుతుంది. దీని వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చు. అక్కడ టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
News September 3, 2025
హరీశ్ వల్లే వారంతా పార్టీని వీడారు: కవిత

TG: గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు పార్టీని వీడారని మండిపడ్డారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీశే కారణం. హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు. నాన్నకు నన్ను దూరం చేసేందుకు కుట్ర చేశారు’ అని ఆమె విరుచుకుపడ్డారు.
News September 3, 2025
అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం: కవిత

TG: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తల్లికి దూరంగా ఉండటమే తనను ఎక్కువగా బాధిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘తల్లితో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? నా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకుమించిన బాధ ఇంకోటి లేదు. రాజకీయ పదవులు వస్తాయి, పోతాయి. కానీ తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు’ అని ఎమోషనల్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అవటం తన జీవితంలో ముఖ్యమైన పరిణామం అని పేర్కొన్నారు.