News September 21, 2025

90 శాతం సబ్సిడీతో పసుపు విత్తనాలు, పరికరాలు

image

AP: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో పసుపు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు విత్తనాలు, సాగు పరికరాలను 90 శాతం సబ్సిడీపై అందించనుంది. కేవలం 10 శాతం రైతులు చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.93 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News September 21, 2025

పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

image

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.

News September 21, 2025

పాడి పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు

image

వైరల్ ఫీవర్ కురమ సోకితే పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు పట్టేయడం, పడుకొని లేవలేకపోవటం, కదలకుండా ఉండటం వంటి లక్షణాలు పశువుల్లో కనిపిస్తాయి. దీంతో పాటు పశువుల్లో వణుకు, చెవులు వాలేసి ఉండటం, గురక పెట్టడం, పళ్లు నూరడం, నెమరు వేయకపోవటం, ఆకలి లేకపోవటం, మూలగడం, గొంతు నొప్పి, చొంగ పడటం, కుంటడం, కీళ్ల నొప్పులతో పాటు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముక్కు, కళ్ల నుంచి నీరు వస్తుంది.

News September 21, 2025

గర్భిణులకు బార్లీ సురక్షితమేనా?

image

బార్లీ వాటర్‌ను తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొందరిలో వికారం, గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్‌ను పెంచడంలో బార్లీ సహాయపడుతుంది. రోజుకి 1-2 గ్లాసుల బార్లీ నీరు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే విరేచనాలు, అలెర్జీ, రక్తస్రావం, సైనస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.