News January 18, 2025
రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి

ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్(23) మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్ను ట్రక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అమన్ ‘ధర్తీపుత్ర్ నందిని’ అనే సీరియల్లో లీడ్ రోల్లో నటించారు.
Similar News
News January 7, 2026
నెల్లూరులో టాటా పవర్ అతిపెద్ద ప్లాంట్.. ₹6,675 కోట్ల పెట్టుబడులు!

AP: నెల్లూరులో టాటా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ(TPREL) ₹6,675 కోట్లతో 10GW సామర్థ్యంతో ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ సెంటర్గా నిలవనుంది. సెమీకండక్టర్ చిప్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఈ మెటీరియల్స్ చాలా కీలకం. ఈ సంస్థ రాకతో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
News January 7, 2026
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.
News January 7, 2026
‘జన నాయగన్’ వాయిదా.. రాజాసాబ్కు జాక్పాట్

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ‘రాజాసాబ్’ జాక్పాట్ కొట్టింది. తమిళనాడులోని దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో జన నాయగన్ స్థానంలో రాజాసాబ్కు షోలు కేటాయిస్తున్నారు. దీంతో పండుగ వేళ తెలుగుతో పాటు తమిళంలో భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ రెండు సినిమాలు జనవరి 9కి రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలతో విజయ్ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.


