News January 18, 2025
రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి

ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్(23) మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్ను ట్రక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అమన్ ‘ధర్తీపుత్ర్ నందిని’ అనే సీరియల్లో లీడ్ రోల్లో నటించారు.
Similar News
News November 21, 2025
పిల్లలకు నెబ్యులైజర్ ఎక్కువగా వాడుతున్నారా?

పిల్లల నెబ్యులైజర్లో ఉపయోగించే మందులు సాధారణంగా స్టెరాయిడ్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదని సూచిస్తున్నారు. దీన్ని ఎక్కువగా వాడితే వాంతులు, అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. నెబ్యులైజర్ పైపును సరిగ్గా క్లీన్ చెయ్యకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు/ న్యుమోనియా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
News November 21, 2025
వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (1/2)

AP: రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ధాన్యాన్ని సులభంగా విక్రయించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సేవలను రైతులు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
☛ ధాన్యం అమ్మాలనుకునే రైతులు 7337359375 నంబరుకు HI అని మెసేజ్ పెట్టాలి.
☛ AI ద్వారా ప్రత్యేక వాయిస్ ఈ సేవలను ఎలా వాడుకోవాలో మీకు తెలుపుతుంది.
News November 21, 2025
వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (2/2)

☛ తర్వాత రైతు తన ఆధార్ నంబరు నమోదుచేసి పేరును ధ్రువీకరించాలి.
☛ ధాన్యం అమ్మాలనుకునే తేదీకి 3 ఆప్షన్లు ఇస్తుంది. వాటిలో ఒక తేదీ, సమయం ఎంపిక చేసుకోవాలి.
☛ తర్వాత దాన్యం రకం నమోదు చేసి, ఎన్ని బస్తాలు అమ్ముతారో తెలపాలి. ☛ ఓ మెసేజ్ ద్వారా రైతులకు ధాన్యం అమ్మకం స్లాబ్ బుక్ అయినట్లు కూపన్ కోడ్ వస్తుంది.
☛ ఈ కూపన్ కోడ్ తీసుకెళ్లి రైతు తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు.


