News April 29, 2024
ఇక తక్కువ ధరలోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు

ఇండియన్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు జియో సిద్ధమైంది. మధ్యతరగతి ప్రజలు సులువుగా కొనుగోలు చేసేలా తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురానుంది. Wyzr పేరుతో ఎయిర్ కూలర్లను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘జియో ఫోన్’లాగే తక్కువ ధరలకే టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందించనుంది. పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.
Similar News
News November 9, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 9, 2025
జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?
News November 9, 2025
15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్సిగ్నల్?

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.


