News April 29, 2024

ఇక తక్కువ ధరలోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు

image

ఇండియన్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు జియో సిద్ధమైంది. మధ్యతరగతి ప్రజలు సులువుగా కొనుగోలు చేసేలా తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురానుంది. Wyzr పేరుతో ఎయిర్ కూలర్లను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘జియో ఫోన్’లాగే తక్కువ ధరలకే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందించనుంది. పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.

Similar News

News February 4, 2026

DANGER: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

image

బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. కానీ వాటిని సరిగా శుభ్రం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, సిస్టిక్ సిర్రోసిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే గుండెల్లో మంట, నోటి దుర్వాసన వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. వీటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News February 4, 2026

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

image

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <>క్లిక్<<>> చేయండి. SHARE IT

News February 4, 2026

ప్రాజెక్టులకు రూ.18వేల కోట్లు బకాయి పెట్టారు: రామానాయుడు

image

AP: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.18వేల కోట్లు బకాయి పెట్టిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. YCP విధ్వంసంతో ఇరిగేషన్ శాఖ గాడి తప్పిందన్నారు. పోలవరం, హంద్రీనీవా, వెలిగొండ, గాలేరునగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఖరీఫ్ ముగిసినా రిజర్వాయర్లలో నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్‌మెంట్ వల్లే అని పేర్కొన్నారు.