News July 1, 2024
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.
Similar News
News April 10, 2026
గులాబీ గూటికి జీవన్ రెడ్డి.. కండువా కప్పనున్న KCR

TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి BRSలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న జగిత్యాలలో BRS భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్హౌజ్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీలో చేరిక తేదీని కన్ఫర్మ్ చేశారు. ఇక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పట్టు కోల్పోయిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
News April 10, 2026
ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

TGSRTCలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్పేట్ PTCలో వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.
News April 10, 2026
RCB Vs RR.. టాస్ ఆలస్యం

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్ను పరిశీలించి టాస్పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.


