News July 28, 2024
USలో రెండున్నర లక్షలమందికి డిపోర్టేషన్ ముప్పు

తల్లిదండ్రులతో US వెళ్లి, అక్కడే పెరిగి పెద్దై ఇంకా గ్రీన్ కార్డు రానివారికి పెద్ద చిక్కొచ్చి పడింది. పేరెంట్స్తో వెళ్లి డిపెండెంట్ వీసా మీద ఉన్న పిల్లలకు 21 ఏళ్లు నిండిన వారికి అది రద్దవుతుంది. అలాంటి వారంతా దేశాన్ని వీడాలని యూఎస్ తేల్చిచెబుతోంది. బాధితుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశానికి ఎలా వెళ్లాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 21, 2026
ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం డాలర్తో కంపేర్ చేస్తే రూ.91.74కు సమానంగా ఉంది. అమెరికా-గ్రీన్లాండ్ ఉద్రిక్తతల నడుమ భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు జరిపారు. దీంతో మార్కెట్లు కుదేలై రూపాయి పతనం వైపు నడిచింది. అటు 2026లో రూపాయి విలువ 1.98% మేర పడిపోయింది. ఆసియాలో పతనమైన కరెన్సీలో ఇది రెండో ప్లేస్లో ఉంది.
News January 21, 2026
కుమారస్వామిని ఆరాధిస్తే..

కుమారస్వామిని ఆరాధించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. ఆయనను కొలిస్తే శత్రుభయం, కోర్టు సమస్యల నుంచి విముక్తి లభించి విజయాలు వరిస్తాయి. సునిశిత బుద్ధికి ప్రతీక అయిన ఆయన ‘వేలు’ (శూలం) పిల్లలకు చదువు, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కుజ దోష నివారణకు, సంతాన ప్రాప్తికి, ఆధ్యాత్మిక ఉన్నతికి షణ్ముఖుని పూజ ఉత్తమమైన మార్గం. సర్ప రూపంలో ఆయనను ఆరాధించడం కుండలిని శక్తిని జాగృతం చేసి యోగ సాధనకు తోడ్పడుతుంది.
News January 21, 2026
శబరిమల బంగారం చోరీ.. ప్రధాన నిందితుడికి బెయిల్

శబరిమల బంగారం చోరీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళలోని విజిలెన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 90 రోజుల్లోపు ఛార్జిషీట్ వేయడంలో SIT విఫలమైనందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్టేట్మెంట్ల ఆధారంగా విచారించాల్సి ఉన్నందున పొట్టికి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇక రాజీవరు బెయిల్పై కోర్టు గురువారం తీర్పు చెప్పనుంది.


