News December 25, 2024
స్పేస్లో రూపాయి ఖర్చుకు రెండున్నర రెట్ల ఆదాయం: సోమ్నాథ్

2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటే ఇస్రో లక్ష్యమని ఇస్రో లక్ష్యమని ఛైర్మన్ సోమ్నాథ్ వెల్లడించారు. ఇందుకోసం 2028లో తొలి మాడ్యూల్ని నింగిలోకి పంపిస్తామన్నారు. చంద్రుడిపైకి 2040కి వ్యోమగాములను పంపే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనల కోసం కేంద్రం రూ.31వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. స్పేస్ రంగంపై చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు రూ.2.52 ఆదాయం వస్తోందని వెల్లడించారు.
Similar News
News October 28, 2025
‘మొంథా’ తుఫాన్.. సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధం

* అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం 488 కంట్రోల్ రూమ్ల ఏర్పాటు
* ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
* పలు జిల్లాల్లో 219కి పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు
* అత్యవసర కమ్యూనికేషన్ కోసం 81 వైర్లెస్ టవర్లు ఏర్పాటు
* సహాయక చర్యలకు 321 డ్రోన్లు సిద్ధం, అందుబాటులో JCBలు, క్రేన్లు
* ఇప్పటికే 38 వేల హెక్టార్లలో పంట నష్టం, 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా
News October 28, 2025
రేపు ఈ జిల్లాల్లో సెలవు

AP: తుఫానుతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరులో సెలవు ఇచ్చారు. అటు కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు రేపు హాలిడే ప్రకటించారు.
News October 28, 2025
Way2News ‘తుఫాను’ అప్డేట్స్

AP: మొంథా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్డేట్లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.


