News August 15, 2025
రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

AP: తెల్లవారుజామున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి HYD వెళ్తుండగా ఘటన జరిగింది. ముందు వెళ్తున్న బస్సును వెనక వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 15, 2025
నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు.. సీఎం అభినందనలు

AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి(D) నారావారిపల్లెకు పీఎం సూర్యఘర్ పథకం కింద స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో తక్కువ టైంలో సోలార్ రూఫ్టాప్ పనులను పూర్తి చేశారు. దీంతో ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద కేంద్రం గుర్తించింది. SEP 20న ఢిల్లీలో జిల్లా అధికారులు అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులను CM చంద్రబాబు అభినందించారు.
News August 15, 2025
అమల్లోకి రూ.3000 యాన్యువల్ పాస్

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి రూ.3,000 ఫాస్టాగ్ పాస్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పాస్ తీసుకుంటే ఫాస్టాగ్ను పదేపదే రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు ఈ పాస్తో ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి <<17380892>>క్లిక్ <<>>చేయండి.
News August 15, 2025
తొలిరోజు వార్-2 కలెక్షన్స్ ఎంతంటే?

NTR, హృతిక్ కాంబోలో నిన్న రిలీజైన ‘వార్-2’ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. నార్త్లో తొలిరోజు కలెక్షన్లు ఊహించిన స్థాయిలో లేనట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ వెర్షన్స్ కలిపి ఇండియాలో సుమారు ₹60 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీ ట్రేడ్ అనలిస్ట్ Sacnilk తెలిపింది. హిందీ కంటే తెలుగులో కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంది. సెలవు, వీకెండ్ నేపథ్యంలో కలెక్షన్స్ స్టడీగా కొనసాగే అవకాశముంది.