News October 7, 2024
కరాచీ ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి

పాకిస్థాన్ కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన <<14292979>>ఉగ్రదాడిలో<<>> ఇద్దరు చైనీయులు మరణించారు. ఈమేరకు పాక్లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తొలుత దీన్ని ఆత్మాహుతి దాడిగా భావించినా, వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు తర్వాత అధికారులు గుర్తించారు. కాగా విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇప్పటికే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
Similar News
News March 27, 2026
బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు.. మోదీతో రేవంత్

TGలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి CS ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు PM మోదీ టెలికాన్ఫరెన్స్లో CM రేవంత్ తెలిపారు. ప్రతి బంక్లో స్టాక్, విక్రయాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించామని, 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఇకపై RTCలో ఈవీ బస్సులే వాడతామని PM దృష్టికి తీసుకెళ్లారు.
News March 27, 2026
సరిహద్దు రాష్ట్రాలు జాగ్రత్త: మోదీ

సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. షిప్పింగ్, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎంలతో వర్చువల్ మీటింగ్లో చెప్పారు. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు.
News March 27, 2026
సరిహద్దు రాష్ట్రాలు జాగ్రత్త: మోదీ

సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. షిప్పింగ్, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎంలతో వర్చువల్ మీటింగ్లో చెప్పారు. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు.


