News March 19, 2024
ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు సీఐలు

TS: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు కీలక మలుపు తిరిగింది. ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు సీఐలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్లో పని చేస్తున్న ఆ ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు టాపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్ ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వికారాబాద్ అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ వెనుక ఓ మీడియా యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News October 25, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

ఐఐటీ బాంబే 53 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్సైట్: https://www.iitb.ac.in/career/apply
News October 25, 2025
త్వరలో వెండిపైనా రుణాలు!

బంగారం మాదిరే వెండిపైనా బ్యాంకుల్లో లోన్లు తీసుకొనే అవకాశం తొందర్లోనే అందుబాటులోకి రానుంది. 2026 APR 1 నుంచి కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, NBFCలు, ఫినాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేలా RBI గైడ్ లైన్స్ ఇచ్చింది. రూ.2.5లక్షల వరకు తీసుకునే రుణానికి వెండి మార్కెట్ విలువలో 85%, రూ2.5-రూ.5లక్షల మధ్య రుణానికి 80%, ఆపై 75% రుణం పొందొచ్చు. ఓ వ్యక్తి గరిష్ఠంగా 10KGల వరకు వెండిని హామీగా ఉంచి లోన్ తీసుకోవచ్చు.
News October 25, 2025
అంతర పంటల్లో ఈ జాగ్రత్తలు ముఖ్యం

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.


