News October 24, 2024
వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు

AP: పల్నాడు(D) దాచేపల్లిలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. వారి మృతికి నీరు కలుషితం కావడమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్లలో నీటిని విజయవాడ ల్యాబ్కు పరీక్షలకు పంపాలని ఆదేశించారు. బోర్లను మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్తో ఈ వార్త వైరలవుతోంది.
News December 15, 2025
రేపు ఉదయం దట్టమైన పొగమంచు.. జాగ్రత్త

తెలంగాణలో రేపు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, సెంట్రల్ తెలంగాణ జిల్లాల ప్రజలు రేపు ఉదయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైవేలపై ప్రయాణం చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Share it
News December 15, 2025
వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి?

ప్రకృతి, మానవ జీవన మనుగడలను సమన్వయం చేస్తూ మనల్ని రక్షించే శాస్త్రమే ‘వాస్తు’ అని, మన క్షేమం కోసం వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటున్నారు. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమే అంటున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబలో ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


