News September 19, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జెడ్డా నుంచి వచ్చిన సకీనా అస్వస్థతకు గురై ఎయిర్‌పోర్టులోనే కుప్పకూలారు. సిబ్బంది వారిని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు.

Similar News

News December 8, 2025

పాడేరు: టెన్త్ పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

image

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 9వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అల్లూరి DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. రూ.50 పెనాల్టీతో ఈనెల 12, రూ.200ల పెనాల్టీతో 15, రూ.500ల పెనాల్టీతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. అల్లూరి జిల్లాలో 244 విద్యాలయాల్లో 11,354మంది పదో తరగతి విద్యార్థులున్నారన్నారు. అందరూ పరీక్షలకు హాజరు అయ్యేలా టీచర్స్ కృషి చేయాలన్నారు.

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?