News October 9, 2024
కోడికి ఈత నేర్పిస్తూ ఇద్దరి మృతి.. మరో వ్యక్తి గల్లంతు

AP: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెం కోడిని ఈత కొట్టిస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 19, 2025
ఈ ఏడాది ఇండియాలో ఎంతమంది పుట్టారంటే?

ఈ ఏడాది కూడా ఇండియాలో ఎక్కువ జననాలు నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. DEC 2వ వారానికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన జననాల్లో సుమారు 2.3 కోట్ల (23.1 మిలియన్)తో మనం టాప్ ప్లేస్లో ఉన్నాం. తర్వాతి స్థానాల్లో చైనా (87 లక్షలు), నైజీరియా (76 లక్షలు), పాకిస్థాన్ (69 లక్షలు) ఉన్నాయి. కాగా 2025లో సంతానోత్పత్తి రేటు (1.9) స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ప్రపంచ జనాభాలో భారత్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
News December 19, 2025
కాలీఫ్లవర్లో ‘రైసీనెస్’ రావడానికి కారణమేంటి?

ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో కాలీఫ్లవర్లో పువ్వు వదులుగా విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గడ్డపై నూగు వస్తుంది. దీని వల్ల పంట నాణ్యత తగ్గి, మార్కెట్ విలువ ఆశించిన మేర అందక రైతులు నష్టపోతారు. రైసీనెస్ సమస్య నివారణకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కాలీఫ్లవర్ రకాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాలీఫ్లవర్ పువ్వులను కూడా సరైన సమయంలో ఆలస్యం చేయకుండా పంట నుంచి సేకరించాలి.
News December 19, 2025
ఐ మేకప్ వేసుకొనే ముందు

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.


