News June 27, 2024
BRS ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

TG: BRS నుంచి కాంగ్రెస్లో చేరే MLAల కోసం రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే BRS నుంచి కాంగ్రెస్లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. మరికొందరు హస్తం గూటికి చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. పోచారం శ్రీనివాస్ కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 7, 2026
PHOTOS: KKRvsPBKS మ్యాచ్

ఐపీఎల్-2026లో భాగంగా KKR, PBKS మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అభిమానులు దాదాపు 4-5 గంటలు వేచిచూశారు. చివరికి వర్షం తగ్గినా నీరు బాగా నిలిచి ఉండటంతో మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. KKR ఓనర్ షారుక్ ఖాన్, ఆయన కూతురు సుహానా ఖాన్, బెంగాల్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ, గాయంతో టోర్నీకి దూరమైన హర్షిత్ రానా తదితరులు కూడా స్టేడియానికి వచ్చారు.
News April 7, 2026
నేటి ముఖ్యాంశాలు

* కాంగ్రెస్ పాకిస్థాన్ పాట పాడుతోంది: ప్రధాని మోదీ
* AP రాజధానిగా అమరావతి.. గెజిట్ రిలీజ్
* AP: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గింపు
* త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ప్రారంభం: CM రేవంత్
* TN లాకప్ డెత్ కేసు.. 9మంది పోలీసులకు మరణ శిక్ష
* బాసర ఆలయ పున:నిర్మాణానికి సీఎం భూమిపూజ
* CEC జ్ఞానేశ్ కుమార్పై విపక్షాల అభిశంసన నోటీసును తిరస్కరించిన రాజ్యసభ
* IPL: KKR, PBKS మ్యాచ్ రద్దు
News April 7, 2026
ఇది ఏపీ ప్రజల విజయం: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ <<19585476>>నోటిఫికేషన్<<>> విడుదల చేయడంపై CM చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతుల విజయం అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలందరికీ, రాష్ట్ర నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.


