News March 21, 2024
మరో రెండు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇవాళ ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, KMM, NLG, SRPT, MHBD, WL, JN జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరించింది. ఏపీలోని అల్లూరి, కోనసీమ, తూ.గో, ELR, GNT, బాపట్ల, OGL జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.
Similar News
News September 9, 2025
హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

1.హిమాలయ దేశం నేపాల్లో నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.
News September 9, 2025
రేపు జగన్ ప్రెస్మీట్

AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకి మీడియాతో సమావేశం అవుతారని YCP ప్రకటనలో తెలిపింది. ఇవాళ యూరియా కొరతపై వైసీపీ నేతలు ‘అన్నదాత పోరు’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి నెలకొంది.
News September 9, 2025
ఐదుగురిపై ఛార్జ్షీట్ దాఖలుకు సిద్ధమైన ACB

TG: ఫార్ములా ఈ-రేస్ <<16712706>>కేసులో<<>> కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ సహా మరో నలుగురిపై న్యాయ విచారణకు ACB సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్కుమార్, BLN రెడ్డి, కిరణ్, FEO సీఈవోపై ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని సమాచారం.