News July 1, 2024
ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్: జైషా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు BCCI సెక్రటరీ జైషా తెలిపారు. ‘కోచ్, సెలక్టర్ నియామకం త్వరలోనే జరుగుతుంది. CAC నిర్ణయించిన పేర్లను ప్రకటిస్తాం. జింబాబ్వేకు వెళ్లే జట్టుతో లక్ష్మణ్ కోచ్గా వెళ్తారు. కొత్త కోచ్ శ్రీలంక సిరీస్తో జాయిన్ అవుతారు’ అని పేర్కొన్నారు. కాగా గంభీర్ను కోచ్గా ఎంపిక చేశారనే ప్రచారం నడుమ జైషా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Similar News
News February 21, 2025
మా దేశంలో ఉండొద్దు.. బీబీసీకి అజెర్బైజాన్ ఆదేశాలు

తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్బైజాన్ ఆదేశించింది. తమ చట్టప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు.. BBC ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోందని అజెర్బైజాన్ మండిపడింది.
News February 21, 2025
టెన్త్ అర్హతతో 32,438 ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా RRB మరో వారం రోజులు పొడిగించింది. మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. 4-13 వరకు కరెక్షన్ విండో ఓపెన్లో ఉంటుంది. టెన్త్/ITI పాసై, 18-36 ఏళ్ల వయసున్న వారు అర్హులు. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://www.rrbapply.gov.in/
News February 21, 2025
24 గంటలూ షాపులు తెరవచ్చు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

TG: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలో మార్చి 2 నుంచి 31 వరకు షాపులను 24 గంటలూ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే యాజమాన్యం రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. సెలవుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.