News June 27, 2024
డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు?

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్, ఇప్పటికే టెట్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తోందట. ఈ నెల 30న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 15, 2025
BHPL: కొడుకు చనిపోయినా కళ్లు బతకాలనుకున్నారు!

కొడుకు చనిపోయి పుట్టెడు శోఖంలో ఉన్నా అతడి కళ్లు బతకాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. HYD ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకోవడమే కాదు.. వేల మందికి ఆదర్శంగా నిలిచారు ఆ దంపతులు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు గోవర్ధన్ కుమారుడు శ్రవణ్ గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. దీంతో కొడుకు నేత్రాలను తల్లిదండ్రులు దానం చేశారు.
News September 15, 2025
‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.
News September 15, 2025
రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

TG: హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.