News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News February 11, 2026
గోడపై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.
News February 11, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 34 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.celindia.co.in
News February 11, 2026
అభిషేక్ రేపు ఆడతారా.. తిలక్ ఏమన్నారంటే?

T20WC: కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్న అభిషేక్ రేపు నమీబియాతో జరిగే మ్యాచ్లో ఆడతారా? లేదా? అన్న సందేహం నెలకొంది. దీనిపై తిలక్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. రేపు మ్యాచ్ టైమ్కు అతని ఫిట్నెస్ను బట్టి ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు అభిషేక్ గైర్హాజరైతే అతని స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.


