News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 11, 2026

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA, CS, ICSI మెంబర్ షిప్‌తో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.concorindia.co.in

News February 11, 2026

పితృ దోషంతో పెళ్లికి ఆటంకాలు ఎదురవుతాయా?

image

జాతకంలో పితృ దోషం ఉన్నప్పుడు సంతానంతో పాటు వివాహం కూడా ఆలస్యమవుతుంది. పూర్వీకుల ఆశీస్సులు లేకపోవడం వల్ల ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీనికి పరిష్కారంగా అమావాస్య రోజున పితృ తర్పణాలు వదలాలి. గయ, కాశీ వంటి క్షేత్రాలలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే దోషం తొలగుతుంది. నిరుపేదలకు అన్నదానం చేయాలి. గోసేవ అత్యంత శ్రేష్ఠం. తద్వారా పితృ దేవతలు శాంతించి, త్వరగా పెళ్లి సంబంధం కుదిరేలా అనుగ్రహిస్తారు.

News February 11, 2026

క్యాబేజీ, కాలీఫ్లవర్‌లో నారుకుళ్లు తెగులు నివారణ

image

క్యాబేజీ, కాలీఫ్లవర్ నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కనిపిస్తుంది. దీని వల్ల నారు మొక్కల కాండం, మొదళ్లు మెత్తగా తయారై కుళ్లి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన మడులపై లేదా ప్రోట్రేలలో నారును పెంచాలి. విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులను ఇవ్వకూడదు. నారు మొలిచిన తర్వాత లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.