News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News January 28, 2026
T20 వరల్డ్ కప్లో ఆడాల్సిందే: పాక్ మాజీలు

బంగ్లాదేశ్కు మద్దతుగా T20 WCను <<18966853>>బహిష్కరించాలని<<>> పాకిస్థాన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీ చీఫ్ నఖ్వీకి వ్యతిరేకంగా పాక్ మాజీలు గొంతు విప్పుతున్నారు. టోర్నీకి వెళ్లకపోతే పాక్కే నష్టమని హెచ్చరిస్తున్నారు. WCకు జట్టును పంపాలని ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్, మొహ్సిన్ ఖాన్, రషీద్ సూచించారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకుని ఏం సాధిస్తారని పీసీబీ మాజీ కార్యదర్శి అబ్బాసీ ప్రశ్నించారు.
News January 28, 2026
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ 1/2

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ మోడ్లోకి వెళ్లాయి. రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉండడంతో పార్టీ పరంగా ఆమేరకు సీట్లు ఇస్తామని అవి ఇంతకు ముందు ప్రకటించాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ పార్టీ గుర్తులతో జరుగుతున్నా స్పందించడం లేదు. అధికారికంగా 32% సీట్లు BCలకు వస్తున్నందున అదనపు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నాయి. వాటి తీరుపై BCల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News January 28, 2026
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ 2/2

TG: CM రేవంత్ విదేశాల్లో ఉండడంతో INCలో BCలకు 42% సీట్లపై PCC చీఫ్పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక BRSలో వేరే పరిస్థితి. OC ఆధిపత్యం ఎక్కువ ఉన్నందున పార్టీలో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉందని BC నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. BJPలో కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, నిజామాబాద్లలో బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నా అధినేతల నుంచి రెస్పాన్స్ లేదంటున్నారు. MNP ఎన్నికల నామినేషన్ల గడువు ఈనెల 30తో ముగుస్తుంది.


