News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News February 15, 2026
ఛావా, పుష్ప-2 రికార్డులు బ్రేక్

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోనూ ఇంకా క్రేజ్ తగ్గలేదు. BMSలో లాంగెస్ట్ ట్రెండింగ్(59 రోజులు) ఇండియన్ ఫిల్మ్గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలో విక్కీ కౌశల్ ‘ఛావా’(58 D) రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో స్త్రీ-2(57 D), ప్రేమలు, పుష్ప-2(53 D), మంజుమ్మల్ బాయ్స్(50 D) ఉన్నాయి.
News February 15, 2026
శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.
News February 15, 2026
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్లో ఇంటర్న్షిప్

<


