News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News January 13, 2026
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News January 13, 2026
కవిత కాంగ్రెస్లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్చాట్లో తెలిపారు.
News January 13, 2026
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చద్దా

క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల డెలివరీ’ విధానాన్ని కేంద్రం <<18845524>>తొలగించడంపై<<>> ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే.. అంతా కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది’ అంటూ X వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది డెలివరీ బాయ్స్పై ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో కూడా గిగ్ వర్కర్ల భద్రతపై ఆయన <<18483406>>గళమెత్తి<<>> వారికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.


