News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News January 12, 2026

సంక్రాంతికి మరో 3 ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతికి ద.మ.రైల్వే అనకాపల్లి-చర్లపల్లి మధ్య అదనంగా మరో 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అనకాపల్లిలో 18న ఒక ట్రైన్(07479), 19న ఒక ట్రైన్(07478) రాత్రి 10.30 గం.కు బయలుదేరి తర్వాతి రోజు ఉ.11.30గం.కు చర్లపల్లి చేరుకుంటుంది. 19న చర్లపల్లి(07477)లో అర్ధరాత్రి 12.40 గం.కు బయలుదేరి అదే రోజు రా.9 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, GNT, VJA, రాజమండ్రి మీదుగా నడుస్తాయి.

News January 12, 2026

హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా

image

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో వారం రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోనియా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తదుపరి చికిత్సను వైద్యులు ఇంటివద్దే కొనసాగించాలని సూచించారని తెలిపాయి.

News January 12, 2026

పింగళ, గేరువా జాతి పుంజులను ఎలా గుర్తిస్తారు?

image

‘ఎర్రపొడ’ రకం పుంజు ఈకలు ఎక్కువ ఎరుపుగా, పొడిగా మెరుస్తూ ఉంటాయి. ‘సవల’ కోడి మెడపై నల్లని ఈకలుంటాయి. ‘కొక్కిరాయి’ ఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి. ‘మైల’ ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి. ‘పూల’ ఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి. ‘పింగళ’ పుంజుకు ఎక్కువగా రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. ‘గేరువా’ జాతి కోడిపుంజుకు తెలుపు, లేత ఎరుపు రంగు ఈకలు మిశ్రమంగా ఉంటాయి.