News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News February 2, 2026
ఎర్రజెండా.. ప్రజల గళం: CM రేవంత్ ‘రెడ్’ మార్క్ పాలిటిక్స్!

TG: ప్రజల పక్షాన నిలిచి వాళ్ల గళం వినిపించే పార్టీ ఎర్రజెండా అని CM రేవంత్ రెడ్డి కొనియాడారు. కనీస వేతన చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి కమ్యూనిస్టుల ఎన్నో డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకే నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ CPIతో దూరం పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
News February 2, 2026
BJP ఏజెంట్లా EC పనిచేస్తోంది: మమతా

వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. CEC జ్ఞానేశ్ కుమార్తో మీటింగ్ అనంతరం ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 58 లక్షల మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ కమిషన్ BJP ఏజెంట్లా పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు TMC కార్యకర్తలు అధికారులపై దాడులు చేస్తున్నారని, BLOలకు గౌరవ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని EC పేర్కొంది.
News February 2, 2026
USAపై భారత్-A విజయం

T20WC వార్మప్ మ్యాచ్లో USAపై భారత్-A జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అమెరికా చివరి వరకు పోరాడి 200కు ఆలౌటైంది. ఆ జట్టులోని ఆండ్రిస్ 44, సంజయ్ 41, శుభమ్ 28, హర్మీత్ 25, మిలింద్ 18, మోహ్సిన్ 21 రన్స్ చేశారు. రవి బిష్ణోయ్ 3, ఖలీల్, నమన్ చెరో 2 వికెట్లు, తిలక్, అశోక్, బదోనీ తలో వికెట్ తీశారు. కాగా USA జట్టులోని మెజార్టీ ప్లేయర్లు భారత సంతతికి చెందినవారే.


