News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News December 16, 2025
కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం

AP: కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి APSP ఆరోబెటాలియన్లో జరిగే ఈ కార్యక్రమంలో CM CBN పాల్గొననున్నారు. అభ్యర్థులతో సమావేశమై కాసేపు ముచ్చటిస్తారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి ట్రైనింగ్ ఉంటుంది. 2022 NOVలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని టెస్టులను దాటుకుని 5,757 మంది ట్రైనింగ్కు ఎంపిక అయ్యారు.
News December 16, 2025
ధనుర్మాసంలో శ్రీవ్రతం ఆచరిస్తే..?

నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ పుణ్య కాలంలో శ్రీవ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. విష్ణువును మధుసూధనుడిగా పూజించి గోదాదేవి కీర్తనలు ఆలపిస్తారు. ఫలితంగా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు కృష్ణుడికి తులసి మాల సమర్పిస్తే నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందని సూచిస్తున్నారు. ☞ శ్రీవ్రతం ఎలా చేయాలి? గోదాదేవి కీర్తనల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 16, 2025
పొగపెట్టి ఎలుకలను నిర్మూలించడం

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించే విధానాన్ని పంట ఏ దశలోనైనా అనుసరించవచ్చు. బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా ఎలుకలు ఉండే కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. అయితే పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేయాలి. పొగను కనీసం మూడు నిమిషాలు వదలాలి. ఇలా చేస్తే ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించవచ్చు. తదుపరి సీజన్లో వాటి ఉద్ధృతిని తగ్గించవచ్చు.


