News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 6, 2026

BREAKING: భారీగా తగ్గిన వెండి ధర

image

వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. కాగా 2 రోజుల్లోనే వెండి ధర రూ.40 వేలు తగ్గింది.

News February 6, 2026

శ్రీవారి నేత్ర దర్శనం ఏరోజు ఉంటుందంటే?

image

శ్రీ వేంకటేశ్వర స్వామి నేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. అలాగే ప్రకాశవంతమైనవి కూడా! ఆ విశ్వశక్తిని సామాన్య మానవులు నేరుగా చూడలేరు. అందుకే స్వామివారి కళ్లను ఎప్పుడూ పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. కేవలం గురువారం నాడు మాత్రమే ఆయన కళ్లను చూడవచ్చు. ఆనంద నిలయంలో ప్రతి గురువారం ‘నిజరూప దర్శనం’ సమయంలో మాత్రమే ఆ కర్పూర నామాన్ని తగ్గించి స్వామివారి నేత్రాలను చూసే అవకాశం కల్పిస్తారు.

News February 6, 2026

తొందరపడుతున్న బంగ్లాదేశ్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

image

భారత్-US ట్రేడ్‌ డీల్‌ తర్వాత బంగ్లాదేశ్‌ కూడా అగ్రరాజ్యంతో ‘సీక్రెట్’ ఒప్పందం కోసం తొందరపడుతోంది. ఈ నెల 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 9వ తేదీన హడావుడిగా ఒప్పందంపై సైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడ్ డీల్ అంటే పలుమార్లు చర్చిస్తారు. అందులోని విషయాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలతో పంచుకుంటారు. ఇవేవీ లేకుండా రహస్యంగా డీల్‌కు రెడీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.