News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News January 29, 2026

‘వారణాసి’ మూవీ రిలీజ్ తేదీ ఇదేనా?

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వారణాసి పట్టణంలో ‘ఏప్రిల్ 7 2027న థియేటర్లలో విడుదల’ అనే హోర్డింగ్స్ ఏర్పాటు చేయగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఆరోజునే ఉగాది ఉండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

News January 29, 2026

నాపై తప్పుడు ప్రచారం చేశారు: శశి థరూర్

image

పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న MP శశి థరూర్ ఎట్టకేలకు INC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో వారిద్దరిని కలిశారు. సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అనంతరం థరూర్ మీడియాకు చెప్పారు. ‘అంతా బాగానే ఉంది. మేమంతా ఒకే మాట మీద ఉన్నాం. నేను ఎప్పుడూ పార్టీ కోసమే పనిచేశాను. ఏనాడూ పదవులు అడగలేదు. నాపై తప్పుడు ప్రచారం చేశారు’ అని అన్నారు.

News January 29, 2026

మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.