News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 9, 2026

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా: రేవంత్

image

TG: పదేళ్లు పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు తమ ప్రభుత్వంపై విషం చిమ్మడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పదేళ్లు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు వాళ్లే ఉన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయంటే వారే కారణం. ఇప్పుడు మళ్లీ వచ్చి ఓటు వేయాలని అడిగేందుకు అర్హత ఉందా?’ అని ఫైర్ అయ్యారు.

News February 9, 2026

మీ షాంపూలో సల్ఫేట్ ఉందా..?

image

మార్కెట్‌లో లభించే చాలా షాంపూల్లో ఉండే సల్ఫేట్ జుట్టుకు ప్రమాదకరమని చర్మ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి తలపై ఉండే సహజ నూనెలను పూర్తిగా తొలగించి జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. సల్ఫేట్-ఫ్రీ షాంపూలు ఉపయోగిస్తే జుట్టు ఆయిలీగా అనిపించినా స్కాల్ప్ హెల్త్ మెరుగుపడుతుందని అంటున్నారు. అదే విధంగా తలపై తేమ ఉండటం వలన హెయిర్ హెల్తీగా ఉంటుందని సూచిస్తున్నారు.

News February 9, 2026

పన్నుల వాటా తప్ప.. కేంద్రం ఇచ్చిందేముంది: రేవంత్

image

రాష్ట్ర పన్నుల వాటా తప్ప కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిందేముంది అని CM రేవంత్ ప్రశ్నించారు. ‘దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోంది. TGకు ప్రతి రూపాయి ట్యాక్స్‌పై 42 పైసలు తిరిగి ఇస్తున్నారు. కర్ణాటకకు 16 పైసలు, TNకు 26 పైసలే చెల్లిస్తున్నారు. అదే బిహార్ రూపాయి పన్ను చెల్లిస్తే 6 రూపాయిలు ఇస్తున్నారు. MPకి 2 రూపాయల 9 పైసలు, UPకి 2 రూపాయల 3 పైసలిస్తున్నారు’ అని చెప్పారు.