News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 8, 2026

IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ఇండియన్ <<>>ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్లొమా, ఇంటర్, వొకేషనల్ కోర్సు, టెన్త్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 1, 2006-జులై1, 2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎత్తు 152సెం.మీ. ఉండాలి. వెబ్‌సైట్: https://iafrecruitment.edcil.co.in

News February 8, 2026

కనకాంబరం సాగుకు అనువైన రకాలు

image

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.

News February 8, 2026

భాను సప్తమి వ్రతం నేడు ఎందుకు ఆచరిస్తారంటే?

image

నేడు భాను సప్తమి వ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వ్రతం చేయాలని సూచిస్తున్నారు. జాతకంలో సూర్య దోషం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, తేజస్సు పొందుతారట. సూర్యుడు ‘ఆరోగ్య ప్రదాత’ కావడంతో, భాను సప్తమి నాడు చేసే పూజ, అర్ఘ్యంతో మానసిక ప్రశాంతత, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.