News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 10, 2026

మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

image

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.

News February 10, 2026

వంట చేస్తూ మాట్లాడుతున్నారా?

image

వంట చేయడం ధ్యానం వంటిది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఆహారం వండేటప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. టీవీ చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో వంట చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. మౌనంగా చేస్తే వంటకాలు మరింత రుచికరంగా తయారవుతాయని నమ్మకం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రశాంతంగా, ఏకాగ్రతతో వంట చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 10, 2026

రేపు ఉద్యోగులకు సెలవు

image

TG: రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్లలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు చేసింది. సెలవు లేదనే కారణంగా ఓటుకు దూరం కావొద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే <<19099000>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.