News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 16, 2026

ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సిన్!

image

TG: సర్వైకల్(గర్భాశయ) క్యాన్సర్‌ ముప్పు నుంచి అమ్మాయిలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14-15 ఏళ్ల వయసున్న 4 లక్షల మంది బాలికలకు HPV వ్యాక్సిన్‌ను త్వరలో ఉచితంగా పంపిణీ చేయనుంది. మార్కెట్లో ఈ టీకా ఒక్కో డోసు రూ.2-4 వేలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 4 వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో వ్యాధి రాకముందే అరికట్టేందుకు ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ వేయనుంది.

News February 16, 2026

తుస్సుమన్న పాకిస్థాన్.. ‘రైవల్రీ ఎక్కడ సర్?’

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ తేలిపోయిన విషయం తెలిసిందే. ఇండియా ఏకపక్ష విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘గ్రేటెస్ట్ రైవల్రీ’ ఎక్కడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సర్.. ఇండియా, పాక్ మ్యాచ్‌ను రైవల్రీ(పోటీ/వైరం) అని పిలవకండి. 2 జట్లు 15 మ్యాచులు ఆడి, చెరో 7 లేదా 8‌‌‌‌-7 గెలిస్తే దాన్ని రైవల్రీ అనొచ్చు. కానీ ఇక్కడ <<19154130>>పోటీనే లేదు<<>>’ అంటూ మీడియాతో సూర్య చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. మరి మీరేమంటారు?

News February 16, 2026

ఎక్ససైజ్ చేసినా బరువు తగ్గడం లేదా?

image

జిమ్‌లో కసరత్తులు, డైలీ జాగింగ్ చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది మదనపడుతుంటారు. అయితే క్యాలరీలను అతిగా బర్న్ చేశామని భావించడం, వ్యాయామం తర్వాత ఎక్కువగా తినడం దీనికి కారణం కావచ్చని డైటీషియన్లు అంటున్నారు. ‘ఎక్ససైజ్ చేస్తున్నామని రోజువారీ దినచర్యపై నిర్లక్ష్యం వహించడం, సరిగ్గా నిద్రపోకపోవడం కూడా కారణం కావచ్చు. జిమ్‌తోపాటు క్రమశిక్షణ ముఖ్యం. కఠిన డైట్ కొనసాగించాలి’ అని సూచిస్తున్నారు.