News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 9, 2026

ఒక్క నిమిషంలో పని ఒత్తిడి తగ్గించుకోండి!

image

ఆఫీస్‌లో వర్క్ లోడ్ వల్ల ఎంతోమంది ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో గుండె వేగం, BP పెరుగుతాయి. వాగస్ నాడిని యాక్టివేట్ చేయడంతో దానిని కంట్రోల్ చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ముక్కు ద్వారా లంగ్స్ నిండా గాలిపీల్చుకోండి. ఆపి మరో షార్ప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత నోటిగుండా మెల్లగా మొత్తం గాలిని వదిలేయండి. ఇలా 4-5సార్లు చేస్తే ఒక్క నిమిషంలోపే మీ స్ట్రెస్ లెవల్స్ తగ్గిపోతాయి’ అని చెబుతున్నారు.

News February 9, 2026

‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

image

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్‌’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.

News February 9, 2026

పాక్ గొంతెమ్మ కోర్కెలు.. కుదరదన్న ICC!

image

T20WC: ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ICCకి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ‘భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్, IND-PAK-BAN మధ్య ట్రై సిరీస్, భారత్ వచ్చే ఏడాది బంగ్లాలో పర్యటించాలి’ అని కోరినట్లు సమాచారం. పాక్ గొంతెమ్మ కోర్కెలను ICC తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘అది మా పరిధి కాదు’ అని ICC సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.