News October 22, 2024
షా, ఫడ్నవీస్తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో సంచలనం!
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముంబైలో అమిత్ షా సమక్షంలో DY CM దేవేంద్ర ఫడ్నవీస్ను శివసేన UBT నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ కలిశారన్న వార్తలు సంచలనంగా మారాయి. వీరు మహాయుతిలో చేరతారేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ భేటీ వార్తలను రౌత్ కొట్టిపారేసినా ఎక్కువ సీట్లను రాబట్టేలా MVAను బెదిరించేందుకు SS UBT ఇలాంటి ఫీలర్లు వదులుతోందన్న విమర్శలూ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.
Similar News
News October 22, 2024
ఝార్ఖండ్ ఎలక్షన్స్: BJPలో అసంతృప్తి సెగలు
ఝార్ఖండ్ BJPలో అసంతృప్తి జ్వాలలు లేచాయి. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని ముగ్గురు మాజీ MLAలు సహా కొందరు నేతలు అధికార JMMలో చేరారు. 66 మందితో BJP తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మాజీ CM చంపై సోరెన్, బాబులాల్ సోరెన్ సహా సగానికి పైగా వలస నేతలే ఉన్నారు. అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద పార్టీలకు ఇలాంటివి సహజమేనని పోల్స్ కో ఇన్ఛార్జ్ హిమంత బిశ్వశర్మ అన్నారు.
News October 22, 2024
15 రోజుల్లో డ్రోన్ పాలసీ: CBN
AP: విజయవాడ వరద సాయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రం కానుందని పేర్కొన్నారు. దీని కోసం 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
News October 22, 2024
మత మార్పిడి వివాదంలో చిక్కుకున్న టీమ్ఇండియా క్రికెటర్!
క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేసింది. ఆమె తండ్రి ఇవాన్ క్లబ్ ప్రెసిడెన్షియల్ హాల్లో మత మార్పిళ్లను ప్రోత్సహిస్తుండటమే ఇందుకు కారణం. ‘Brother Manuel Ministries’ తరఫున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించారని క్లబ్ మెంబర్ శివ మల్హోత్ర అన్నారు. ‘దేశవ్యాప్తంగా కన్వర్షన్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడిది మా వద్దే జరిగింది. క్లబ్లో ఇలాంటివి నిషేధం’ అని తెలిపారు.