News March 18, 2025
27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
Similar News
News October 31, 2025
ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?

ధ్వజం అంటే పతాకం. ధ్వజస్తంభం ఉత్సవానికి సంకేతం. హైందవ సంస్కృతిలో దీని చుట్టూ ప్రదక్షిణ చేశాకే దైవదర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఆలయోత్సవాలు మొదలయ్యేటప్పుడు ఈ స్తంభంపై జయపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభం లేని ఆలయాలకు స్వాములు దేవాలయ గుర్తింపు ఇవ్వరనే నమ్మకం ఉంది. దీనిని ఆలయ హృదయంగా భావిస్తారు. ఇది భక్తులకు శక్తిని, శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠిస్తారు.
News October 31, 2025
ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.
News October 31, 2025
ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.


