News April 8, 2024

ఉగాది ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల ధరలు

image

రేపు ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో తెల్ల చామంతి KG రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి.

Similar News

News November 18, 2025

17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

image

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.

News November 18, 2025

17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

image

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.

News November 18, 2025

నారద, తుంబురులు కాదు.. ‘హనుమంతుడు’

image

ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో అని నారద, తుంబురుల మధ్య ఓనాడు వివాదం ఏర్పడింది. దీంతో హనుమంతుడి దగ్గరకు వెళ్లారు. ‘నాకు రామభక్తి తప్ప ఇంకేం తెలీదు. ఆయన గానమే చేస్తా’ అని కీర్తనలు చేయడం మొదలుపెట్టాడు. ఆ గానానికి శిలలు కరిగిపోయాయి. నారద, తుంబురుల వాయిద్యాలు అందులో కలిసిపోయాయి. ఆ తర్వాత వారు కూడా గానం చేశారు. కానీ, ఏ శిలా కరగలేదు. దీంతో హనుమే గొప్పవాడని తెలుసుకొని, అణిగిన గర్వంతో వెనక్కి వెళ్లిపోయారు.