News June 29, 2024

యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు ప్రకటన

image

యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈసారి పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు.

Similar News

News December 23, 2025

జవాన్‌ శేఖర్‌ ఇకలేరు.. శోకసంద్రంలో పెనుమంట్ర

image

పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ సమీపంలోని తీస్టా నదిలో సోమవారం శీతాకాలపు శిక్షణ నిర్వహిస్తున్న క్రమంలో ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న పెనుమంట్ర మండలం ఆలమూరుకి చెందిన జవాన్ శేఖర్ గల్లంతయ్యారు. సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తరువాత శేఖర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీంతో శేఖర్ సొంత గ్రామం ఆలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఆయన మృతదేహం స్వగ్రామానికి తరలించనున్నారు.

News December 23, 2025

రైతు కన్నీరు.. దేశానికి ముప్పు!

image

రైతు <<18647657>>దినోత్సవ<<>> వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటుండటం కలిచివేస్తోంది. అప్పుల ఊబిలో పడి ఏటా వేల సంఖ్యలో చనిపోతుండటం ఆందోళనకరం. లోకానికి అన్నం పెట్టేవాడు ఆకలి, అవమానంతో ప్రాణాలు వదులుతుంటే ‘జై కిసాన్’ అనే నినాదం మనల్ని వెక్కిరిస్తోంది. పొలం గట్టున రైతు ప్రాణం గాలిలో కలిసిపోతుంటే ఆ పక్కనే ఉన్న పైరు రోదిస్తోంది. రైతు ఆత్మహత్య లేని రోజే దేశానికి నిజమైన పండుగ.

News December 23, 2025

గుచ్చి మష్రూమ్స్ కేజీ రూ.40 వేలు.. ఎక్కడ పెరుగుతాయి?

image

మంచు కరిగే సమయం, వింటర్ చివరిలో గుచ్చి మష్రూమ్స్ (మొరెల్స్/మోర్చెల్లా ఎస్కులెంటా) సహజంగా పెరుగుతాయి. HP, ఉత్తరాఖండ్, J&K ప్రాంతాల్లో లభిస్తాయి. తడి నేల, రాలిన ఆకుల కింద, దట్టమైన అడవిలో మొరెల్స్ పెరుగుతాయి. సంప్రదాయ వైద్యంతోపాటు ఖరీదైన వంటకాల్లో వినియోగం, అంతర్జాతీయ డిమాండ్‌తో కేజీ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో వారాలపాటు వెతికితే కొంత మొత్తంలో లభిస్తాయి.