News June 29, 2024
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు ప్రకటన

యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈసారి పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
Similar News
News December 11, 2025
TGలో లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు: కేంద్రం

TGలో గత 10 నెలల్లో 1,40,947 రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అనర్హులు, నకిలీ కార్డుల ఏరివేత, వలసలు, వ్యక్తుల మరణాలు వంటి కారణాలతో ఈ కార్డులు రద్దు చేసినట్లు తెలిపింది. e-KYC లేదా ఆధార్ వెరిఫికేషన్ కాలేదన్న కారణంతో ఒక్క కార్డు కూడా రద్దు కాలేదని పేర్కొంది. ప్రస్తుతం TGలో మొత్తం 56.60L, APలో 88.37L రేషన్ కార్డులున్నాయి. APలో ఈ ఏడాది 50,681 కార్డులు రద్దయ్యాయి.
News December 11, 2025
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: గిద్దలూరు మాజీ MLA పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
News December 11, 2025
భారత్కి సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా: మస్క్

స్టార్లింక్ ద్వారా భారత్కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నానని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్తో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమైన తరువాత మస్క్ ఈ విధంగా స్పందించారు. భారత్లో చివరి మైలు కనెక్టివిటీని శాటిలైట్ ద్వారా విస్తరించే దిశగా చర్చలు జరిగాయని సింధియా ‘X’లో పోస్ట్ చేశారు. డిజిటల్ భారత్ లక్ష్యాలకు శాటిలైట్ టెక్నాలజీ కీలకమని అన్నారు.


