News August 21, 2024
ఉక్రెయిన్ టూర్: మోదీ వెళ్లే రైలిదే

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 23న పోలాండ్ నుంచి <<13902900>>ఉక్రెయిన్కు<<>> ‘రైల్ ఫోర్స్ వన్’లో ప్రయాణించనున్నారు. ఈ విలాసవంతమైన రైలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అత్యున్నత స్థాయి ప్రయాణాన్ని అందిస్తుంది. అత్యంత భద్రతతో కూడిన ఈ రైలులో పెద్ద టేబుల్స్, సోఫా, టీవీ, విశ్రాంతి కోసం పడక గది ఉంది. మొత్తం 20 గంటల ప్రయాణంలో యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాల గుండా 10 గంటలు ప్రయాణించి కీవ్ నగరానికి చేరుకుంటారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


