News February 15, 2026

UN రిపోర్ట్.. 3 రోజుల్లో 6,000 మంది హతం!

image

సుడాన్‌లోని డార్ఫర్‌లో గతేడాది OCTలో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ మారణహోమం సృష్టించాయని ఐక్యరాజ్యసమితి(UN) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. RSF దాడుల్లో 3 రోజుల్లోనే (OCT 25th-27th) 6వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. RSF సైనికులు సామూహిక హత్యలు, లైంగిక హింసకు పాల్పడినట్లు తెలిపింది. సూడాన్ మిలిటరీ, RSFకి మధ్య 2023 APRలో మొదలైన ఆధిపత్య పోరు యుద్ధానికి దారితీసింది.

Similar News

News February 15, 2026

స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు: మమతా మోహన్‌దాస్

image

తాను క్యాన్సర్, బొల్లి సమస్యలతో బాధపడుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని హీరోయిన్ <<10013472>>మమతా మోహన్‌దాస్<<>> తెలిపారు. ‘ఆ టైంలో ఓ ప్రముఖ మలయాళ నటుడితో డేటింగ్ చేశా. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని దాచి మోసం చేశాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమె 2011లో ప్రజిత్‌ను పెళ్లి చేసుకోగా 6 నెలలకే విడిపోయారు.

News February 15, 2026

తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడిషీయల్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కోర్టు అసిస్టెంట్స్, కోర్టు అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, 7వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in

News February 15, 2026

అనుకోకుండా జాగరణ చేసినందుకే!

image

గుణనిధి కథ మహాశివరాత్రి ఉపవాసం, జాగరణల విశిష్టతను తెలుపుతుంది. దురలవాట్లు గల గుణనిధి ఓ శివరాత్రి నాడు ఆహారం దొరకక అనివార్యంగా ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం కోసం శివాలయానికి వెళ్తే అక్కడ అందరూ జాగారణ చేస్తూ కనిపించారు. దీంతో గుణనిధి కూడా జాగరణ చేస్తాడు. చివరకు ఆలయంలోనే మరణిస్తాడు. కానీ, తెలియకుండానే ఉపవాసం ఉండి జాగరణ చేయడంతో పాపాలు నశించాయి. మరుసటి జన్మలో నిధుల అధిపతి కుబేరుడిగా జన్మించాడు.