News June 22, 2024
నిరుద్యోగి ఆత్మహత్య.. నాలుగేళ్లకు జాబ్ కాల్లెటర్

TG: మంచిర్యాల(D) మందమర్రికి చెందిన జీవన్కుమార్(24) 2018లో జూనియర్ లైన్మెన్ పరీక్ష రాశారు. తర్వాత మిగులు పోస్టుల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా మెరిట్ ఆధారంగా భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈక్రమంలో విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈనెల 24న రావాలంటూ జీవన్కు కాల్లెటర్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం రాకపోవడంతో అతడు 2020లోనే ఆత్మహత్య చేసుకున్నారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<