News July 30, 2024

ర్యాపిడోకు యూనికార్న్ హోదా

image

బైక్, ఆటో, క్యాబ్ సర్వీసులను అందిస్తున్న స్టార్టప్ ర్యాపిడో యూనికార్న్ సంస్థగా అవతరించింది. తాజాగా సిరీస్ ఇ ఫండింగ్‌లో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ ద్వారా దాదాపు రూ.1,000 కోట్లు సమీకరించడంతో ఈ ఘనత సాధించింది. కంపెనీ విలువ 100 కోట్ల డాలర్లు(రూ.8,300 కోట్లు) దాటితే యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ వేదికగా 2015లో ర్యాపిడో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోంది.

Similar News

News November 12, 2025

NIA, ఐబీ చీఫ్‌లతో అమిత్ షా భేటీ

image

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్‌లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్‌ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్‌పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.

News November 12, 2025

స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

image

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.

News November 12, 2025

‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

image

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.