News July 30, 2024
ర్యాపిడోకు యూనికార్న్ హోదా

బైక్, ఆటో, క్యాబ్ సర్వీసులను అందిస్తున్న స్టార్టప్ ర్యాపిడో యూనికార్న్ సంస్థగా అవతరించింది. తాజాగా సిరీస్ ఇ ఫండింగ్లో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ ద్వారా దాదాపు రూ.1,000 కోట్లు సమీకరించడంతో ఈ ఘనత సాధించింది. కంపెనీ విలువ 100 కోట్ల డాలర్లు(రూ.8,300 కోట్లు) దాటితే యూనికార్న్గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ వేదికగా 2015లో ర్యాపిడో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోంది.
Similar News
News October 29, 2025
49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://bdl-india.in/
News October 29, 2025
సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ SMలో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
News October 29, 2025
దేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతాడంటే?

‘భక్త్యాత్యనన్యయా శక్యః’ అంటుంది భగవద్గీత. అంటే అనన్య భక్తి కల్గిన వారికే దేవుడు స్వాధీనమవుతాడని అర్థం. ఎలాంటి ఆశలు లేకుండా, కేవలం భగవంతుడిపైనే విశ్వాసం ఉంచి, ఆయనతో నిలబడే భక్తులపైనే ఆయన అనుగ్రహం ఉంటుంది. అనన్య భక్తితో పూజ, సేవ, నామస్మరణ, కీర్తన, జపం, ధ్యానం వంటి సాధనలు చేసే వారికి, ఆ దేవుడు కేవలం స్వామీ, రక్షకుడే కాకుండా, వారి హృదయాలలో సులభంగా లభించేవాడుగా, స్వాధీనమయ్యేవాడుగా ఉంటాడు. <<-se>>#WhoIsGod<<>>


