News June 15, 2024

గుజరాత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమపై కేంద్రమంత్రి విమర్శలు

image

గుజరాత్‌లో USకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న తీరును కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తప్పుపట్టారు. కల్పించే ప్రతీ ఉద్యోగానికి సగటున ఈ సంస్థ రూ.3.2కోట్ల సబ్సిడీ పొందనుందన్నారు. ‘5వేల ఉద్యోగాలు తెచ్చే ఈ కొత్త యూనిట్‌కు $2 బిలియన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇది కంపెనీ పెట్టుబడిలో 70% కంటే ఎక్కువ. ఇలాంటి పెట్టుబడులు భారత్‌కు అవసరమా అని అనిపించింది’ అని తెలిపారు.

Similar News

News October 24, 2025

న్యూస్ రౌండప్

image

AP: కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా బోల్తా పడిన క్రేన్, ఆపరేటర్‌కు గాయాలు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
● బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి పార్థసారథి
● ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మృతిపై వైసీపీ చీఫ్ జగన్ సంతాపం
TG: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క
● మూడో వన్డే కోసం సిడ్నీకి చేరుకున్న టీమ్ఇండియా

News October 24, 2025

ఇతిహాసాలు క్విజ్ – 45 సమాధానాలు

image

1. రావణుడు పుష్పక విమానాన్ని ‘కుబేరుడి’ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
2. కురు రాజ్యానికి మంత్రి ‘విదురుడు’.
3. ఆంజనేయుడికి గదను ఆయుధంగా ‘కుబేరుడు’ ఇచ్చాడు.
4. లక్ష్మీదేవి ‘క్షీరసాగర మథనం (పాల సముద్రం చిలికినప్పుడు) సమయంలో’ ఆవిర్భవించింది.
5. యమధర్మరాజు సోదరి ‘యమునా దేవీ’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 24, 2025

బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

image

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.