News June 15, 2024
గుజరాత్లో సెమీకండక్టర్ పరిశ్రమపై కేంద్రమంత్రి విమర్శలు

గుజరాత్లో USకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న తీరును కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి తప్పుపట్టారు. కల్పించే ప్రతీ ఉద్యోగానికి సగటున ఈ సంస్థ రూ.3.2కోట్ల సబ్సిడీ పొందనుందన్నారు. ‘5వేల ఉద్యోగాలు తెచ్చే ఈ కొత్త యూనిట్కు $2 బిలియన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇది కంపెనీ పెట్టుబడిలో 70% కంటే ఎక్కువ. ఇలాంటి పెట్టుబడులు భారత్కు అవసరమా అని అనిపించింది’ అని తెలిపారు.
Similar News
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే?

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, శరీరంలో జరిగే కొన్ని మార్పులు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, ఒత్తిడి దీనికి కారణాలంటున్నారు నిపుణులు.
News December 8, 2025
కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.. అల్లూరిలో 5.3 డిగ్రీలు నమోదు

ఏపీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపట్టులో 7.7, డుంబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లి 9.5, హుకుంపేటలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అటు తెలంగాణ HYDలోని HCUలో 9 డిగ్రీలు, BHELలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు పేర్కొన్నారు.
News December 8, 2025
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<


