News February 21, 2025

మిర్చిధరలపై కేంద్రమంత్రి సమావేశం

image

AP: మిర్చి పంటకు కనీస మద్దతు ధరపై వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ నేతృత్వంలో నేడు భేటీ జరగనుంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా పంట మద్దతు ధరపై సంబంధిత వర్గాలతో చర్చించనున్నట్లు సమాచారం. ధరల పతనంపై సమీక్షతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యను కేంద్రమంత్రికి వివరించిన సంగతి తెలిసిందే.

Similar News

News February 4, 2026

CUET UG.. మరికొన్ని గంటలే ఛాన్స్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG-2026) రిజిస్ట్రేషన్ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. రా.11.50 వరకు <>cuet.nta.nic.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈనెల 7వరకు ఫీజు చెల్లింపు, ఈ నెల 9 నుంచి 11 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. మే 11 నుంచి 31 మధ్య పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా సెంట్రల్, స్టేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాలకు NTA ఈ ఎగ్జామ్ నిర్వహిస్తోంది.

News February 4, 2026

ఎంత సంపద ఉన్నా.. ఆనందం లేదా?

image

సంపద ఎంతున్నా దాన్ని అనుభవించలేకపోతే అందుకు పండితులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. శనివారం శెనగలు పంచడం, శివలింగానికి బిల్వార్చన చేయడం మంచిదంటున్నారు. నిత్యం ధ్యానం చేయాలంటున్నారు. ‘అమ్మవారికి పసుపు చీర సమర్పించాలి. శుక్రవారం ధ్వజస్తంభం వద్ద మినప్పండి దీపం వెలిగించాలి. ఇంటికి వేపాకుల దండ కట్టడం వల్ల దిష్టి తొలగి ఆస్తులు అనుభవించే యోగం కలుగుతుంది. దానాలు శీఘ్ర ఫలితాలు ఇస్తాయి’ అంటున్నారు.

News February 4, 2026

గుడ్ న్యూస్: గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

image

TG: రాష్ట్రంలోని గృహాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్లను ఉచితంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇళ్లకు కనెక్షన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు అయ్యే ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలు చేసేవారు. ఇప్పుడిది ఉచితంగా అందుతుంది. ఈ సౌకర్యం పారిశ్రామిక రంగానికి వర్తించదు.