News December 11, 2024
బ్యాంకుల్లో మొండి బాకీలపై కేంద్ర మంత్రి ప్రకటన

ప్రభుత్వరంగ బ్యాంకులిచ్చిన రుణాల మొండి బాకీలు 3.09% ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకులు మంజూరు చేసిన దాని విలువ రూ.3.16లక్షల కోట్లు అని రాజ్యసభలో వెల్లడించారు. అటు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1.34లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు. అది 1.86%కి సమానమన్నారు. ప్రభుత్వ రంగం(3.09%)తో పోలిస్తే ఇది తక్కువ అని స్పష్టం చేశారు.
Similar News
News December 7, 2025
వేసవిలో స్పీడ్గా, చలికాలంలో స్లోగా కదులుతున్న హిమానీనదాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాలు వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా కదులుతున్నట్లు నాసా గుర్తించింది. దశాబ్దం పాటు సేకరించిన శాటిలైట్ డేటా ఆధారంగా 36 మిలియన్లకుపైగా ఫొటోలను పరిశీలించి జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. 5 sq.km కంటే పెద్దవైన హిమానీనదాల ఫొటోలను పోల్చి కాలానుగుణంగా వాటి కదలికలను గుర్తించారు. ఫ్యూచర్లో హిమానీనదాల కరుగుదల అంచనాలో కదలికలు కీలకం కానున్నాయి.
News December 7, 2025
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.


