News March 18, 2024

విశ్వవిద్యాలయం అభివృద్ధి ధ్యేయం: వైస్ ఛాన్స్‌లర్

image

కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న రాయలసీమ వర్సిటీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటించారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News July 5, 2024

రేపు జడ్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు అందని సమాచారం

image

కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్‌తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

News July 5, 2024

కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

News July 5, 2024

డా.సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు

image

బాలికపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌‌ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 376తో పాటు బాధితురాలు మైనర్‌ కావడంతో పోక్సో చట్టం సెక్షన్‌ 6 రెడ్‌విత్‌ 5(ఎల్‌) కింద కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.