News February 18, 2025
నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ఎల్నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.
Similar News
News December 20, 2025
ICMRలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ICMRలో 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/
News December 20, 2025
‘రాయలసీమను ఉద్యానహబ్గా మార్చేందుకు నిధులివ్వండి’

AP: ఉద్యానహబ్గా రాయలసీమను మార్చేందుకు వచ్చే బడ్జెట్లో స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని.. కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ‘రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 93 క్లస్టర్లలో 18 ప్రధాన ఉద్యానపంటలు పండుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానసాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు పెంచేందుకు వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్లు అవసరం. దీనికి తగ్గట్లుగా 2026-27 బడ్జెట్లో నిధులివ్వండి’ అని కోరారు.
News December 20, 2025
ఏపీ టెట్ ‘కీ’ విడుదల

ఏపీ టెట్-2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక <


