News February 18, 2025

నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

image

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.

Similar News

News December 31, 2025

జపాన్‌ను దాటేసి.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

image

భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన ఎకానమీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 లోపు జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లలో 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని తెలిపింది. 2025-26 రెండో క్వార్టర్‌లో రియల్ GDP 8.2% వృద్ధి చెందిందని వెల్లడించింది.

News December 31, 2025

సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు.. కారణమిదే!

image

UPలోని మథురలో జరగాల్సిన సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దయింది. పవిత్రమైన శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సన్నీలియోన్‌తో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు పెద్దఎత్తున ప్రచారం చేశారు. టికెట్లూ అమ్మారు. అయితే సాధువులు, మత సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్ రద్దయింది.

News December 31, 2025

డిసెంబర్ 31: చరిత్రలో ఈరోజు

image

✒1600: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు
✒1928: తెలుగు సినిమా నటుడు, మాజీ MP కొంగర జగ్గయ్య జననం
✒1953: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి జననం (ఫొటోలో)
✒1965: భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి VP మేనన్ మరణం
✒2020: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మరణం