News September 28, 2024
అప్పటిదాకా దాడులు ఆపేది లేదు: నెతన్యాహు

ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ ప్రమాదకర శత్రువులను ఎదుర్కొంటుందని అధ్యక్షుడు నెతన్యాహు అన్నారు. UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ హమాస్ ఆయుధాలు విడిచే వరకు తమను తాము కాపాడుకొనేందుకు దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ‘నా దేశం యుద్ధంలో ఉంది. ఈ ఏడాది ఇక్కడికి రాకూడదనుకున్నా. అయితే ఇజ్రాయెల్పై తప్పుడు ఆరోపణలు విని వాటిని సరిదిద్దడానికి రావాలని నిర్ణయించుకున్నా’ అని నెతన్యాహు అన్నారు.
Similar News
News December 18, 2025
భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్పుత్ క్షమాపణలు చెప్పారు.
News December 18, 2025
SMAT ఫైనల్.. ఝార్ఖండ్ భారీ స్కోర్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఝార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 పరుగులు చేసింది. హరియాణా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇషాన్ కిషన్ 101(49B), కుమార్ 81(38B), అనుకుల్ రాయ్ 40(20B), రాబిన్ 31*(14B) అదరగొట్టారు. విజయం కోసం హరియాణా 263 స్కోర్ చేయాల్సి ఉంది.
News December 18, 2025
వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్కు సమర్పించి CBN స్కామ్ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.


