News September 28, 2024
అప్పటిదాకా దాడులు ఆపేది లేదు: నెతన్యాహు

ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ ప్రమాదకర శత్రువులను ఎదుర్కొంటుందని అధ్యక్షుడు నెతన్యాహు అన్నారు. UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ హమాస్ ఆయుధాలు విడిచే వరకు తమను తాము కాపాడుకొనేందుకు దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ‘నా దేశం యుద్ధంలో ఉంది. ఈ ఏడాది ఇక్కడికి రాకూడదనుకున్నా. అయితే ఇజ్రాయెల్పై తప్పుడు ఆరోపణలు విని వాటిని సరిదిద్దడానికి రావాలని నిర్ణయించుకున్నా’ అని నెతన్యాహు అన్నారు.
Similar News
News January 1, 2026
ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉద్యోగాలు

<
News January 1, 2026
భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

డెహ్రాడూన్లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్గఢ్లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.
News January 1, 2026
అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.


