News March 18, 2024

అకాల వర్షం.. రైతన్నలకు నష్టం

image

TG: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కామారెడ్డిలో 20వేలు, నిజామాబాద్‌లో 6వేలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు గోధుమ, ఉల్లి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News March 1, 2026

INDvsWI.. ఒకే ఓవర్లో 24 రన్స్

image

వెస్టిండీస్‌తో మ్యాచులో భారత పేసర్ అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన వేసిన 16వ ఓవర్లో వరుసగా 1, 0, 1, 5WD, 6, WD, 6, 4 వచ్చాయి. విండీస్ బ్యాటర్ పావెల్ చివరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదారు.

News March 1, 2026

కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN

image

AP: అమరావతిలో నేషనల్ జుడీషియల్ అకాడమీని నెలకొల్పాలని CM చంద్రబాబు CJIని కోరారు. ’మధ్యవర్తిత్వం‘పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఇక్కడ నిర్మించే జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే ₹10,000 ఇస్తాం. కేసులు పరిష్కారం కాకున్నా ₹3000 ఇస్తాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్జీల బంగ్లాలను CJI ప్రారంభించారు. AP జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.

News March 1, 2026

BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

image

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్‌లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్‌పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.