News March 18, 2024
అకాల వర్షం.. రైతన్నలకు నష్టం

TG: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కామారెడ్డిలో 20వేలు, నిజామాబాద్లో 6వేలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు గోధుమ, ఉల్లి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News February 19, 2026
మోడల్ స్కూల్స్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ఇలా.. ఫీజు చెల్లింపు: ఫిబ్రవరి 23- మార్చి 31, ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ: ఫిబ్రవరి 24 నుంచి మొదలు. ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 12, మెరిట్, సెలక్షన్ లిస్టు: ఏప్రిల్ 27, సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఏప్రిల్ 30. తరగతులు జూన్ నుంచి ప్రారంభమవుతాయని డైరెక్టర్ విజయరామ రాజు తెలిపారు.
News February 19, 2026
కిడ్నీలను కాపాడుకోండి.. వైద్యుల సూచనలివే!

మానవ శరీరంలో కిడ్నీలు పోరాట వీరులని, వీటిని కాపాడుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, బీపీ & షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘పెయిన్ కిల్లర్స్, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కిడ్నీలు పాడవుతాయి. డైలీ వ్యాయామం చేస్తూ, సమతుల్య ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి. మూత్రం రంగులో మార్పులొస్తే పరీక్షలు చేయించుకోవాలి’ అని తెలిపారు.
News February 19, 2026
పాక్పై విమర్శలు.. హాకీ కెప్టెన్పై వేటు

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ యాజమాన్యం తమను పట్టించుకోలేదని <<19176695>>విమర్శలు<<>> గుప్పించిన పాక్ హాకీ కెప్టెన్ అమ్మాద్ షకీల్ భట్పై వేటు పడింది. పాక్ హాకీ ఫెడరేషన్కు వ్యతిరేకంగా విమర్శలు చేసినందుకు రెండేళ్ల పాటు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాలో బసకు ఏర్పాట్లు లేక రోడ్లపైనే గంటలకొద్దీ తిరిగామని, సొంత ఖర్చులతోనే మేనేజ్ చేసుకున్నట్లు భట్ చెప్పడం చర్చనీయాంశమైంది.


