News April 6, 2024

UPDATE.. కరీంనగర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో గంట విజయ్(17), గంట వర్ష(15), సింధూజ(18)లు మృత్యువాత పడ్డారు. బోర్నపల్లి పెద్దమ్మ జాతరలో పాల్గొని బైక్ పై తిరుగు ప్రయాణం అయిన వీరు అటు వైపుగా వస్తున్న మొరం లారీని చూసి క్రాసింగ్ వద్ద ఆగారు. మొరం తరలిస్తున్న టిప్పర్ అదుపుతప్పి వారిపైనే బోల్తాపడింది. విజయ్, వర్ష, సింధూజలపై మొరం పడటంతో చిక్కుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News December 7, 2025

కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

image

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు RM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. DEC 12న KNR బస్టాండ్ నుంచి సా.8 గం.కు బయలుదేరి, DEC 13న పాపికొండలు బోటింగ్ తదుపరి అదే రోజు రాత్రి భద్రాచలం చేరుకుంటారు. DEC 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వరకు KNR చేరుకుంటుందన్నారు. వివరాలకు డిపోను సంప్రదించాలన్నారు.

News December 7, 2025

కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

image

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు RM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. DEC 12న KNR బస్టాండ్ నుంచి సా.8 గం.కు బయలుదేరి, DEC 13న పాపికొండలు బోటింగ్ తదుపరి అదే రోజు రాత్రి భద్రాచలం చేరుకుంటారు. DEC 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వరకు KNR చేరుకుంటుందన్నారు. వివరాలకు డిపోను సంప్రదించాలన్నారు.

News December 7, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ తొలగిపోతుందని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.