News March 31, 2025
UPDATE: చెరువులో దూకిన వ్యక్తి శవం లభ్యం

తూప్రాన్ పట్టణంలోని మ్యాడక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దాసరి యాదగిరి(40) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఉగాది సందర్భంగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యాదగిరి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలింపు చేపట్టగా సోమవారం శవం లభించింది.
Similar News
News April 5, 2025
మెదక్: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలని వేధించిన వ్యక్తిపై మెదక్ రూరల్ PSలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మెదక్ మండలానికి చెందిన విద్యార్థిని మక్తభూపతి పూర్ పాఠశాలలో పదో తరగతి చివరి పరీక్ష రాసి స్వగ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఖాజిపల్లికి చెందిన అనిల్ కుమార్ తనను ప్రేమించాలంటూ వేధించాడు. అమ్మాయి తల్లి దండ్రులకు తెలపగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 5, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో జరిగింది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. దేవునిపల్లి గ్రామానికి చెందిన సాకేత్ (19) గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో సాకేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2025
మెదక్: చనిపోయిన జింకకు పోస్టుమార్టం.. అంత్యక్రియలు పూర్తి

రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊరి కుక్కల దాడిలో జింక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే జింక మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.