News September 22, 2024

UPDATE.. జనగామ: తల్లిని చంపిన కొడుకు

image

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కొడుకు <<14155815>>తల్లిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సతీశ్ తల్లితో గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, భూమి, డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. ఈక్రమంలో తల్లి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Similar News

News September 22, 2024

పెద్దవంగర: అప్పుల బాధతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. SI క్రాంగి కిరణ్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 22, 2024

WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు.

News September 21, 2024

జనగామ: పీఆర్ పెండింగ్ పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

image

పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అక్టోబర్ 15 కల్లా పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు.