News March 18, 2024

UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.

Similar News

News October 29, 2025

జూబ్లీహిల్స్: KTR రోడ్ షో తేదీలు ఖరారు

image

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. OCT 31న షేక్‌పేట్, NOV 1న రహమత్‌నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంకట్రావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్‌లలో వరుసగా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 30వ తేదీని నుంచి సీఎం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. KCR పర్యటనపై ఇంకా స్పష్టతలేదు.

News October 29, 2025

జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాస్ట్ పాలి‘ట్రిక్స్’..!

image

జూబ్లీహిల్స్‌ గెలుపుకోసం కాస్ట్ ఓటింగ్‌పై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కులాల వారీగా బీసీల ఓట్లు 1.34 లక్షలు, ముస్లిం మైనారిటీలు 1.20 లక్షలు, కమ్మవారి ఓట్లు 22,746, రెడ్డిలు 17,641, లంబాడీలు 11,364, క్రిస్టియన్లు 19,396 మంది, ఎస్సీలు 28,350 మంది ఉన్నట్లు సమాచారం. ఏపీలో వర్కౌట్ అయ్యే కాస్ట్ పాలి‘ట్రిక్స్’ మన దగ్గర అమలవుతుందో చూడాలి.

News October 29, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: భద్రతకు 720 మంది కేంద్ర బలగాలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పకడ్బందీగా.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర బలగాలనూ వినియోగించుకుంటోంది. 8 కంపెనీలకు చెందిన బలగాలు నియోజకవర్గానికి వచ్చేశాయి. ఒక్కో కంపెనీలో 90 మంది చొప్పున మొత్తం 720 మంది సిటీకి చేరుకున్నారు. వీరికితోడు 1,666 మంది స్థానిక పోలీసులు భద్రతలో పాలుపంచుకుంటారు.