News March 27, 2025
UPDATE: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి..

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 6, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

నల్గొండ: 1500 మంది పోలీసులతో భద్రత
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్
చండూర్: పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా హవా
కనగల్: సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి
చండూర్: రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన డిటి
నల్గొండ: మరో ఐదు రోజులే సమయం
నకిరేకల్: జోరందుకున్న దావత్ లు
తిప్పర్తి: ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: మంత్రి
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు: CM

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సని సమీక్షలో CM రేవంత్ పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రాం షెడ్యూల్ను అధికారులు వివరించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను CM వివరించారు. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
News December 6, 2025
భారత్లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్ VVERలను భారత్ నిర్వహిస్తోంది.


