News March 27, 2025

UPDATE: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి..

image

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్‌లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 4, 2025

తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

image

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.

News December 4, 2025

WGL: తొలి విడత బరిలో 10,901 అభ్యర్థులు

image

ఉమ్మడి జిల్లాలో తొలివిడత 555 సర్పంచ్ స్థానాలకు 1,817, 4,952 వార్డు స్థానాలకు 9,084 నామినేషన్లు దాఖలయ్యాయి. WGLలో 91 GPలకు 305, 800 వార్డులకు 1427 నామినేషన్లు వచ్చాయి. HNKలో 69 GPలకు 264, 658 వార్డులకు 1339, JNలో 110 GPలకు సర్పంచ్ 340, 1024 వార్డులకు 1893, MHBDలో 155 GPలకు 468, 1338వార్డులకు 2391, ములుగులో 48 GPలకు178, 420 వార్డులకు 557, BHPLలో 82 GPలకు 262, 712 వార్డులకు 1,477 నామినేషన్లు పడ్డాయి.

News December 4, 2025

GNT: మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు నివాళి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతి నేడు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరులో 1933 జులై 4న జన్మించారు. ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ఏకంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ‘అజాతశత్రువు’గా, మచ్చలేని నేతగా, గొప్ప పరిపాలకుడిగా ఆయనకు మంచి పేరుంది.