News March 27, 2025
UPDATE: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి..

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 17, 2025
సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
News December 17, 2025
MNCL: శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దు- IG

రామగుండం పోలీస్ కమిషనరేట్ను మల్టీజోన్–1 IG ఎస్.చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆర్ముడ్ సాయిధ దళ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి పంచాయతీ ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రత పరిరక్షణ, నేర నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, తదితర అంశాలపై సీపీతో చర్చించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని సూచించారు.
News December 17, 2025
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.


