News November 28, 2024

UPDATE..: మెడ, తల నొప్పింగా ఉందని వెళ్లి విద్యార్థి సూసైడ్ !

image

వనపర్తి జిల్లాలో 7వ తరగతి <<14725607>>విద్యార్థి సూసైడ్<<>> ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. కొన్నూరుకు చెందిన శ్రీనివాసులు కొడుకు ప్రవీణ్‌ మదనాపురం గురుకులంలో చదువుతున్నాడు. మంగళవారం స్కూల్‌లో కబడ్డీ ఆడుతుండగా ప్రవీణ్ తలకు గాయమైంది. బుధవారం ఉదయం మెడ, తలనొప్పిగా ఉందని తండ్రికి చెప్పగా ఆదివారం వస్తానని బుజ్జగించారు. టిఫిన్ చేసి హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.

Similar News

News December 17, 2025

MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే.!

image

పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి ఫలితం వెలువడింది. భూత్పూర్ మండలం లంబాడికుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాన్య నాయక్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో పోటీ చేసిన ఆయన, ప్రత్యర్థులపై ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచారు. జిల్లాలో వెలువడిన మొదటి ఫలితం ఇదే కాగా అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. గ్రామంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

News December 17, 2025

MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

image

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.

News December 17, 2025

మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.