News February 19, 2025

UPDATE: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయం

image

పిట్లం శివారులో NH-161 పై మంగళవారం బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయమైంది. వివరాలీలా.. SRD జిల్లా అంతర్గావ్ వాసి సంగయ్య తన భార్య శకుంతలతో కలిసి బైక్ పై పెద్ద కొడప్గల్‌కు వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. శకుంతల అక్కడికక్కడే మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 11, 2025

అన్నమయ్య: అందాల పోటీల్లో మెరిసిన షేక్ రీమా.!

image

అన్నమయ్య జిల్లా T.సుండుపల్లికి చెందిన షేక్ షాహీనా, షేక్ జహుద్ బాషా దంపతుల కుమార్తె ‘షేక్ రీమా’ అందాల పోటీలో అద్భుత ప్రతిభను కనబరింది. జైపూర్‌లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో షేక్ రీమాకు “మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025” కిరీటం దక్కింది. 2026లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతినిధిగా కూడా ఆమె పాల్గొనబోతున్నారు. మోడలింగ్‌, క్రీడలు, నృత్యంలో రీమా చూపుతున్న బహుముఖ ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

News December 11, 2025

ఇంద్రకీలాద్రిపై పూల శోభ.. మైమరిపిస్తున్న అలంకరణ.!

image

ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల దీక్ష విరమణ మహోత్సవం గురువారం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు పూల అలంకరణతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. అత్యధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులను ఈ అలంకరణ ఎంతగానో ఆకర్షిస్తూ, మైమరిపిస్తోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

News December 11, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

image

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.