News February 19, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయం

పిట్లం శివారులో NH-161 పై మంగళవారం బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయమైంది. వివరాలీలా.. SRD జిల్లా అంతర్గావ్ వాసి సంగయ్య తన భార్య శకుంతలతో కలిసి బైక్ పై పెద్ద కొడప్గల్కు వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. శకుంతల అక్కడికక్కడే మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 22, 2025
తిరిగి ప్రారంభమైన దక్షిణ ప్రాకారం విస్తరణ పనులు

వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ ప్రాకారం విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు. కాగా, భారీ బహుబలి యంత్రంతో రోడ్డుపై రంధ్రాలు చేసేందుకు ప్రయత్నించగా, రోడ్డు వెడల్పుపై స్పష్టత కోరుతూ స్థానికులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, ఇతర అధికారులు స్థానికులకు స్పష్టతనిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దీంతో పనులు పున: ప్రారంభమయ్యాృయి.
News November 22, 2025
నట్స్తో బెనిఫిట్స్: వైద్యులు

నిత్యం స్నాక్స్గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
News November 22, 2025
రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్ ఫ్రీజర్ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.


