News February 19, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయం

పిట్లం శివారులో NH-161 పై మంగళవారం బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయమైంది. వివరాలీలా.. SRD జిల్లా అంతర్గావ్ వాసి సంగయ్య తన భార్య శకుంతలతో కలిసి బైక్ పై పెద్ద కొడప్గల్కు వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. శకుంతల అక్కడికక్కడే మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 13, 2025
HYD: రాబోయే రోజుల్లో చెమట సుక్కలే..!

ఏటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్ల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.
News November 13, 2025
గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్ అబ్దుల్ సాద్ ఊనైస్

గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్గా అబ్దుల్ సాద్ ఊనైస్ ఎంపికయ్యాడు. అబ్దుల్ సాద్ ఊనైస్ బాపట్ల వాసి. రేపు శుక్రవారం నుంచి సెంట్రల్ జోన్ అండర్-14 జోన్ మ్యాచ్లు జరగనున్నాయి. చిన్న వయసు నుంచే క్రికెట్లో సత్తా చాటుతున్న అబ్దుల్ సాద్ గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల పలువురు క్రికెట్, క్రీడా ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 13, 2025
HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.


