News February 19, 2025

UPDATE: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయం

image

పిట్లం శివారులో NH-161 పై మంగళవారం బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయమైంది. వివరాలీలా.. SRD జిల్లా అంతర్గావ్ వాసి సంగయ్య తన భార్య శకుంతలతో కలిసి బైక్ పై పెద్ద కొడప్గల్‌కు వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. శకుంతల అక్కడికక్కడే మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 12, 2025

వికారాబాద్: ముగిసిన రెండో విడత ప్రచారాలు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు ఈరోజు సాయంత్రం 5 గంటలతో నిలిపి వేయాలని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు.

News December 12, 2025

అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

image

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.

News December 12, 2025

నల్గొండ: పార్ట్ టైమ్ ఉపాధ్యాయ పోస్ట్‌కు దరఖాస్తులు

image

నల్గొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు హిందీ బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ స్వామీ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంఏ, బీఏ, హెచ్‌పీటీ (HPT) విద్యార్హత కలిగి ఉండాలి. డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7995010669 నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.