News January 19, 2025
UPDATE: ఆరెపల్లి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

WGL ములుగు రోడ్డు సమీపంలోని ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం <<15190249>>ఓ మహిళ మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీమాబాద్కు చెందిన కనకలక్ష్మి, సాంబలక్ష్మి చీపురు కట్టల వ్యాపారం చేసేవారు. పస్రా నుంచి చీపురు కట్టలు కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా RTC అద్దె బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 9, 2026
పీఎంశ్రీ పాఠశాలలపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన విద్యాలయాల పనితీరుపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఈ పథకం కింద కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు, నిర్వహణ తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు, యోగా శిక్షణ తరగతులు, సైన్స్ ఫెయిర్లు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
News February 9, 2026
వరంగల్: ‘ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు’

ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు ఈనెల 10, 11వ తేదీల్లో, 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
News February 9, 2026
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మద్యం దుకాణాల మూసివేత: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.


