News March 18, 2024
UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.
Similar News
News July 1, 2024
HYD: బోనాల పండుగ.. MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ఈనెలలో బోనాల ఉత్సవాల నేపథ్యంలో హిందూ ప్రజలను ఉద్దేశించి HYD గోషామహల్ MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఎట్టి పరిస్థితుల్లో హలాల్ జరగడానికి వీలు లేకుండా చూడాలన్నారు. మేకను, గొర్రెను బలిచ్చేటప్పుడు హలాల్ చేయనీయొద్దని, హిందూ పద్ధతిలోనే చేయాలన్నారు. ఒకవేళ బలిచ్చే వారు ముస్లిం అయితే అతడు తన మనసులోనైనా సరే ఆ గొర్రెను అల్లాకు సమర్పిస్తున్నానని చెబుతాడని ఆయన ఆరోపించారు.
News July 1, 2024
రాచకొండ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చక్రిపురం వైజంక్షన్, ఎన్ఎఫ్ కూడలి, కుషాయిగూడ ఠాణా సమీపంలోని రమాదేవి ఆస్పత్రి కూడలి, ఏఎస్ రావునగర్, అశోక్ నగర్, కెనరా బ్యాంకు కూడలి, నేతాజీనగర్, హెబ్బీ కాలనీ ఎక్స్ రోడ్డు, తల్లూరి కూడలి, కుషాయిగూడ డీమార్ట్ కూడలి, శారద చౌరస్తా, ఉప్పల్ ఎక్స్ రోడ్డు, చిలుకానగర్, వీటీ కమాన్ తదితర కూడళ్లు ఉన్నాయి.
News July 1, 2024
సైబరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.