News March 4, 2025
UPDATE: NZB: లంచం తీసుకున్న ఇద్దరి అరెస్ట్

ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.
Similar News
News February 26, 2026
మెట్పల్లి: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష సందర్భంగా గురువారం మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
News February 26, 2026
నెల్లూరులో కొత్త మోసం.. జాగ్రత్త!

ఆన్లైన్ దోపిడీకి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. RTO ఆఫీస్ చలానా పేరుతో వాట్సాప్కు APK ఫైల్స్ పంపిస్తున్నారు. నెల్లూరులో కొందరు వీటిని క్లిక్ చేశారు. వారి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఏపీకే ఫైల్ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే నగదు దోచేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News February 26, 2026
ప్రభుత్వ విద్యార్థుల ట్రాన్స్పోర్టుపై సీఎం కీలక ఆదేశాలు

TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ట్రాన్స్పోర్టుకు ఎలక్ట్రిక్ బస్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిలిగిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మండలంలో ట్రాన్స్పోర్ట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో తప్పనిసరిగా పాలు అందించాలని, అందుకోసం విజయ డెయిరీ నుంచి మిల్క్ సేకరించాలని చెప్పారు.


