News January 29, 2025
కారుణ్య నియామకాలపై UPDATE

AP: కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. కారుణ్య నియామకాల ఫైల్ను ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబు వద్దకు పంపింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1,488 పోస్టులు భర్తీ కానున్నాయి. కరోనా కారణంగా 2,917 మంది ఉద్యోగులు చనిపోగా, కారుణ్య నియామకాలకు 2,744 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,488 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించగా, 1,149 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి.
Similar News
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్నకు 1.4 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.


