News December 31, 2024
మన్మోహన్ స్మారకం నిర్మాణంపై అప్డేట్

ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి స్థలం లభ్యతపై CPWD అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. స్మారకం నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్రస్టుకు కేంద్రం భూమి అప్పగిస్తుంది. అనంతరం School of Planning & Architecture ఇచ్చే డిజైన్ ఆధారంగా స్మారకం నిర్మించాలి. ట్రస్టు నిధులు బదిలీ చేస్తే CPWD నిర్మిస్తుంది. వాజ్పేయి స్మారకం నిర్మాణంలో ఇదే విధానాన్ని అనుసరించారు.
Similar News
News December 28, 2025
50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్రాజ్ను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
News December 28, 2025
సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్డ్యామ్స్, ఫామ్పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.
News December 28, 2025
CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

హైదరాబాద్లోని <


