News April 12, 2025

UPI పేమెంట్స్ ఫెయిల్.. స్పందించిన NPCI

image

UPI పేమెంట్స్ నిలిచిపోవడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పందించింది. సాంకేతిక కారణాలతో సేవల్లో అంతరాయం ఏర్పడిందని, పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సేవల పనితీరుపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని, వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. అటు ఇటీవల తరచూ పేమెంట్స్ ఫెయిల్ అవుతుండటంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 7, 2025

సచివాలయాల పేరును మార్చలేదు: CMO

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.

News November 7, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/

News November 7, 2025

శ్రీరాముడి విజయం వెనుక సరస్వతీ దేవి

image

రావణుడితో యుద్ధంలో శ్రీరాముడి విజయానికి సరస్వతీ దేవి పరోక్షంగా కారణమయ్యింది. రావణుడితో పాటు బ్రహ్మ దేవుడు కుంభకర్ణుడికి కూడా వరం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో సరస్వతీ దేవి లోక కళ్యాణానికై అతని నాలుకపై చేరి ‘నిద్ర వరం’ అడిగేలా చేసింది. ఈ అతి నిద్ర కారణంగా కుంభకర్ణుడు ఆలస్యంగా రావడంతో రావణ సైన్యం యుద్ధంలో ఓడిపోయింది. ధర్మసంస్థాపన జరిగింది.
☞ ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.