News January 26, 2025
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి యూపీఎస్

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) కింద ఉంటూ, కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని UPSను ఎంచుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
Similar News
News December 7, 2025
ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 7, 2025
స్మృతితో పెళ్లి రద్దు.. పలాశ్ ఏమన్నారంటే?

స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్ SMలో పోస్ట్ పెట్టారు. ‘పర్సనల్ రిలేషన్షిప్ నుంచి తప్పుకుంటున్నా. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాపై వచ్చిన నిరాధారమైన వదంతులు బాధించాయి. గాసిప్ల ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దనే విషయాన్ని సమాజం నేర్చుకోవాలి. నాపై తప్పుడు కంటెంట్ను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News December 7, 2025
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.


