News June 25, 2024

ఏఐ టెక్నాలజీతో సిద్ధమవుతోన్న UPSC

image

పరీక్షల ప్రక్రియను పటిష్ఠపర్చేలా ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత CCTVలతో పర్యవేక్షణ వ్యవస్థను UPSC రూపొందించుకోనుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్‌లైన్‌కి వెళ్లినా, అనుమానాస్పద కదలికలున్నా, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్నా ఈ సిస్టమ్ అధికారుల్ని అలర్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ IFSలతో సహా 14కీలక పరీక్షల్ని UPSC నిర్వహిస్తోంది. ఏటా దాదాపు 26లక్షల మంది పోటీ పడుతుంటారు.

Similar News

News December 18, 2025

నాణ్యమైన నిద్ర కోసం 10-3-2-1-0 రూల్‌!

image

10-3-2-1-0 రూల్‌తో నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది. నిద్రకు 10 గంటల ముందు కెఫిన్ ఉండే పదార్ధాలను (టీ, కాఫీ) తీసుకోవద్దు. 3 గంటల ముందే భోజనం చేయాలి. ఆల్కహాల్ తాగొద్దు. 2 గంటల ముందు పని, ఒత్తిడికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. గంట ముందు మొబైల్/ల్యాప్‌టాప్ స్క్రీన్‌ ఆఫ్ చేయాలి. మార్నింగ్ అలారం మోగిన వెంటనే లేవాలి. స్నూజ్ బటన్ ఉపయోగించొద్దు. ఈ రూల్స్‌తో నిద్ర నాణ్యత పెరిగి రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు. ప్రయత్నించండి!

News December 17, 2025

నార్త్‌లో ఎందుకు.. సౌత్‌లో వేదికల్లేవా? ఫ్యాన్స్ ఫైర్

image

పొగమంచుతో 4వ టీ20 రద్దు కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. శీతాకాలంలో పొగమంచు కురిసే నార్త్ స్టేట్స్‌లో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచు సమస్య ఉండే వేదికల్లో రాత్రి 7గంటలకు కాకుండా మధ్యాహ్నం మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తక్కువని ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్‌లు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

News December 17, 2025

రూ.కోట్లు ఉంటేనే రాజకీయం!

image

రూ.కోట్లు ఉంటే తప్ప ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయలేమని చాలా మంది ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలూ అలాగే మారిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.25వేలు, <<18557291>>రూ.40వేల<<>> వరకు పంచారంటే ‘ఓటుకు నోటు’ సంస్కృతి ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చదువుకున్న యువతీయువకులు పోటీ చేయాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘డబ్బున్న వాళ్లదే రాజ్యమా?’.. దీన్ని మార్చలేమా? మీ COMMENT?