News June 25, 2024

ఏఐ టెక్నాలజీతో సిద్ధమవుతోన్న UPSC

image

పరీక్షల ప్రక్రియను పటిష్ఠపర్చేలా ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత CCTVలతో పర్యవేక్షణ వ్యవస్థను UPSC రూపొందించుకోనుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్‌లైన్‌కి వెళ్లినా, అనుమానాస్పద కదలికలున్నా, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్నా ఈ సిస్టమ్ అధికారుల్ని అలర్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ IFSలతో సహా 14కీలక పరీక్షల్ని UPSC నిర్వహిస్తోంది. ఏటా దాదాపు 26లక్షల మంది పోటీ పడుతుంటారు.

Similar News

News December 4, 2025

తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

image

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.

News December 4, 2025

పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

image

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్‌లు పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

News December 4, 2025

ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

image

బెంగళూరులో బ్యాచిలర్లకు వింత అనుభవం ఎదురైంది. ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు ఉన్నారని రెసిడెన్షియల్ సొసైటీ ₹5వేల ఫైన్ విధించింది. వారికి బిల్లు కూడా ఇచ్చింది. ‘అతిథులు రాత్రిపూట ఉండేందుకు బ్యాచిలర్లకు అనుమతి లేదని మా సొసైటీలో రూల్ ఉంది. ఫ్యామిలీలకు మాత్రం ఆ రూల్ లేదంట’ అని రెడిట్‌లో ఓ యూజర్ రాసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవచ్చా అని యూజర్లను అడిగారు. ఇంకో ఇంటికి మారడం మంచిదని నెటిజన్లు సూచించారు.