News February 8, 2025

యూరియా కొరత.. రైతన్న వెత

image

TG: ఓవైపు యాసంగి వరిసాగు కీలక దశకు చేరుకున్న సమయంలో రైతన్నల్ని యూరియా కొరత వేధిస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో ఈ సీజన్ వరి సాగవుతోంది. గత నెలలోనే 90శాతం వరినాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి దశలో కీలకమైన యూరియా దొరక్కపోవడం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. వచ్చిన స్టాకు వచ్చినట్లు అయిపోతోంది. దీంతో వ్యాపారులు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News

News February 8, 2025

PHOTO: రోజా కూతురు ర్యాంప్ వాక్

image

AP: మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతున్నారు. వెబ్‌ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ’గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌’లో ఆమె ర్యాంప్‌‌పై నడిచి ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో అన్షు షేర్ చేశారు. ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ అవార్డు సైతం అందుకున్నారు.

News February 8, 2025

ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్

image

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్‌కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

News February 8, 2025

17 సీట్లలో BJP, AAP మధ్య తేడా 1000 ఓట్లే

image

ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.

error: Content is protected !!